31.2 C
Hyderabad
May 3, 2024 00: 39 AM
Slider హైదరాబాద్

సికింద్రాబాద్‌లో నేటి నుంచి వస్త్రదుకాణాల బంద్

#Secundrabad Market

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌‌లోని వస్త్ర వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సికింద్రాబాద్ చేనేత, సిల్కు, వస్త్ర దుకాణదారుల సంఘం అధ్యక్షుడు టి.అశోక్ కుమార్ తెలిపారు.

నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి తాము కారణం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని నగల వ్యాపారులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. ఆయా ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేస్తున్నారు.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోల్‌సేల్ దుకాణదారులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మకాలు కొనసాగించినట్టు హైదరాబాద్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్ వ్యాస్ తెలిపారు.

Related posts

ఆర్టీసీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

బంగాళాఖాతంలో నివర్ తుపాను

Sub Editor

రిమెంబరింగ్: డోన్ లో సరోజినీ నాయుడు జయంతి

Satyam NEWS

Leave a Comment