ప్రబలుతున్న కరోనా సెకండ్ వేవ్ జర్నలిస్టులకు శాపంగా మారింది.
కరోనాతో మీడియా రంగంలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఐజేయూ నేత అమర్ నాథ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సీనియర్ పాత్రికేయులు మరణించారు.
గ్రామీణ విలేకరులతో బాటు పట్టణాలు, నగరాలలో ఉన్నవారు కూడా కరోనా బారిన పడి మరణిస్తున్నారు. చాలా మంది కరోనాతో ఐసోలేషన్ లో ఉండి కుటుంబాలకు దూరమయ్యారు.
గడచిన వారం రోజుల్లో 13 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మరణించారు.
ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ జర్నలిస్టులు, మాజీ ఎడిటర్లు కూడా ఉన్నారు.