వనపర్తి నియోజకవర్గంలో 14 నామినేషన్లను ఆమోదించారు. వనపర్తి రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు వివరాలు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న నామినేషన్ల స్క్రూటినీ చేయాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం నుండి వనపర్తి ఐడిఓసిలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వనపర్తి జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సోమేష్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్ రాజీవ్ మల్హోత్రా, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ సమక్షంలో పరిశీలన చేశారు. 19 మంది అభ్యర్థులకు సంబందించి వచ్చిన మొత్తం 39 నామినేషన్లను నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అని ఒక్కక్కటిగా పరిశీలించారు. పరిశీలన అనంతరం మొత్తం. 19 మంది అభ్యర్థులలో 5 మంది అభ్యర్థుల నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించగా 14 మంది అభ్యర్థుల నామినేషన్ లు ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు తెలియజేశారు.
పూరి సురేష్ శెట్టి, దుప్పల్లి నారాయణ, నాగనమోని చెన్నారాములు, బి. ఒమేష్ గౌడ్, విజయుడు నామినేషన్ తిరస్కరించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్