కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు, సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టారు. పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.