మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తూ ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మీర్పేటలోని 16వ డివిజన్లో ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అందించిన చెత్త సేకరణ వాహనానికి తిరుమల నగర్ కాలనీ హరిహర క్షేత్రం వద్ద పూజ చేసి ప్రారంభించారు. అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మంత్రి సహాయ సహకారాలతో మీర్పేట్ మున్సిపాలిటీలోని కాలనీల్లో స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఆయా డివిజన్లలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వచ్ఛత దిశగా మీర్పేట్ కార్పొరేషన్ అడుగులు వేస్తోందని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ వాహన పూజా కార్యక్రమంలో కార్పొరేటర్తో బాటు వివిధ కాలనీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాలనీవాసులు విద్యాధర్ బట్టు, మేకల యాదగిరి, మన్నెంరెడ్డి, చంద్రునాయక్, బసిగూడెం బల్వంత్రెడ్డి, శంకర్ కుమార్ నాయక్, రమణరాజు, రాంలాల్ నాయక్, రామక్రష్ణ గౌడ్, కాశీనాథ్, సోమేశ్వర్, కిషన్, స్వచ్ఛ దూత్ కావేరి తదితరులు పాల్గొన్నారు.