దాడులు,కిడ్నాప్ లతో కలిసి గ్యాంగ్ లు,ముఠాలతో భయబ్రాంతులు..!
భారత రాజ్యంగంలో మత స్వేఛ్చ,మత పరమైన హక్కులు ఉన్నాయేమో తెలియదు కాని..ఎదరుట వారిని ఇబ్బంది పెట్టకుండా చేయాలన్నది కనీసం పరిజ్ఙానం.అదీ దాడులు,కిడ్పాల్,బెదిరింపులతో అస్సలు చేయకూడదు. ఈ సొది మాకెందుకని పేజి తిప్పకండి…అక్కడికే వస్తోంది.. సత్యం న్యూస్.నెట్ .రెండు రోజుల క్రితం అంటే 25 వతేదీన విజయనగరం పూల్ బాగ్ ప్రాంతం డబుల్ కాలని లో శంకర్ అనే వ్యక్తిని( అంగ వైకల్యం గల) కిడ్నాప్ చేసి సుమారు మూడున్నర గంటలు పాటు చిత్ర హింసలకు గురయ్యాడు. ఆ మర్నాడు సాయంత్రం…ఆ బాధితుడు ప్రబుత్వ హాస్పటల్ లో చేరి…తనని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తుల పేర్లతో టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు న్యాయ బద్దంగా బాధితుని ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై ఎఫ్.ఐ.ఆర్ తో కేసు నమోదు చేసారు.అంత వరకు బాగానే ఉంది.
అంత పెద్ద గొడవ జరిగి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ప్రాణం తీస్తామని బెదిరించి భయ బ్రాంతులకు గురిచేసిన ఘటన నుంచీ తేరుకొక మునుపే…ఆ మరుసటి రోజు మళ్ళీ అదే ప్రాంతానికి మత ప్రచారం పేరుతో పదుల సంఖ్యలో కొందరు పెద్ద పెద్ద శబ్దాలతో భారీ సంఖ్యలో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసారు. అంతలోనే డబుల్ కాలనీలో ఉన్న కొంత మంది యువకులు… హిందూ ధర్మ రక్షా సమితికి తెలియజేసారు. దీంతో సమితి సభ్యులు… వాళ్లని అక్కడ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అయితే అందరు సమానమే అన్ని మతాలు సమానమే అనే నిద్రావస్థలో ఉండే హిందువులార ఇకనైన మేల్కొండి అని “హిందూ ధర్మ రక్షా సమితి” కోరుతోంది.