దాదాపు 20 రోజుల గా కరోనా మూలంగా బంగ్లా నుంచీ ఆఫీసు పనులు చూస్తున్న విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి మళ్ళీ జిల్లాలో పలు స్టేషన్ లను తనిఖీ చేయడం షురూ చేసారు.
ఇందులో భాగంగా పార్వతీ పురం డివిజన్ సాలూరు లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా లోని సాలూరు మండలం గుడ్డంగాని వలస లో కరోనా నియంత్రణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
అలాగే నిరు పేదలకు నిత్యావసర వస్తువులను జిల్లా ఎస్పీ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి ఎన్.సూర్యచంద్ర రావు, పార్వతీపురం డిఎస్పీ శ్రీ ఎ. సుభాష్, సాలూరు సిఐ అప్పల నాయుడు, ఎస్ఐ దినకర్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.