ఖమ్మం పోలీస్ శాఖ షీటీమ్ ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహిస్తున్న 2కె, 5కె రన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ విజ్ఞప్తి చేశారు. పురుషులతో పాటు స్త్రీలకు విద్య సాధికారికత హక్కులు, అభివృద్ధిలో భాగస్వామ్యం సమానంగా లభించినప్పుడే సమాజంలో అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందనే ఉద్దేశ్యంతో ‘లింగ సమానత్వం’ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రజలలో అవగాహన పెంపొందించడానికి షీ టీమ్ ఆధ్వర్యంలో పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ పరుగు పందెం అందరికీ 2k,5k విభాగాలలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆసక్తి వున్నవారు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకొవాలని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిన వారందరికీ మార్చి 26 శనివారం వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో టీ షర్ట్ లు అందజేస్తారని పెర్కొన్నారు.
మార్చి 27న ఉదయం 6 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానం నుండి లకారం పార్క్ వరకు 2k పరుగు ఉంటుందని, అదే పరుగు లకారం పార్క్ చుట్టూ తిరిగి పూర్తిచేస్తే 5k రన్ పూర్తి చేసినట్లు పరిగణించబడుతుందని, వారందరికి మెడల్స్, షీటీమ్ బ్యాగ్స్ అందజేస్తారని తెలిపారు.