సౌర పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 25 ఏళ్ల పాటు చేస్తే బుద్ధిలేదన్నముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 30 ఏళ్లకు పీపీఏలు చేయటం తగునా అని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు.
పీపీఏలు చేసి రూ. 25వేలకు తగ్గించి ఆయా సంస్థలకు సీఎం లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కు మీటర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రూ. 4 వేల కోట్ల అప్పు కోసం కేంద్రానికి దాసోహమనడం సరికాదన్నారు.