ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. కంభం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.
మృతులు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన వారిగా గుర్తించారు. దైవ దర్శనం కోసం తిరుపతి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కంభం సమీపంలో సిమెంట్ లారీని వేగంగా వెనక నుంచి ఢీకొట్టిన కారుకారులో పల్నాడు జిల్లా నుంచి తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం మృతులు అనిమిరెడ్డి(60), గురవమ్మ(60), అనంతమ్మ(55) ఆదిలక్ష్మి(58), నాగిరెడ్డి(24)గా గుర్తించారు.