29.7 C
Hyderabad
May 2, 2024 05: 53 AM
Slider కృష్ణ

5వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ను వెంటనే నియమించాలి

#yvb rajendra prasad

73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలలోని ఆర్టికల్ 243 లో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం స్థానిక ప్రభుత్వాలయిన గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్రప్రభుత్వం ఇవ్వవలసిన వాటా నిధులను తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

అలాగే 4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ నివేదికను శాసనసభ, శాసన మండలి ల ముందు ఉంచి వెంటనే ఆమోదించి దానిని అమలు పరిచి దాని ప్రకారం మా స్థానిక ప్రభుత్వాలకు వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఈ 4, 5 వ రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటులో, అమలులో రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్న జాప్యం వలన స్థానిక ప్రభుత్వాలు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నాయని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ను అమలు చేయకపోవడం, నియమించ కపోవడం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం లోని ఆర్టికల్ 243 కు వ్యతిరేకం. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు.

స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఎగ్గొట్టడం కోసమే కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా దురుద్దేశంతో రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సులను  అమలు చేయడం లేదని ఆయన అన్నారు. గత 3 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇవ్వవలసిన 2019 నుంచి 2022 వరకు సుమారు రూ. 4000 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎగకోట్టింది.

వెంటనే ఆ 4 సంవత్సరాలకు చెందిన సుమారు రూ. 4000 వేల కోట్లు మా స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేసి, అమలు చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం 15 వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను 2021- 22 సంవత్సరానికి చెందిన రెండో క్వార్టర్ నిధులు 969 కోట్లు మరియు 2022- 23 సంవత్సరానికి చెందిన రూ. 2020 కోట్ల నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయకుండా ఆపింది.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ను ఏర్పాటు చేసి అమలు చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లో చలనం లేకపోవడం సిగ్గుచేటైన విషయం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Related posts

స్వచ్ఛత ర్యాంకింగ్ లో నెంబర్ -1 గా కే ఎల్ డీమ్డ్ యూనివర్సిటీ

Satyam NEWS

మంచిగా ఉన్న రోడ్డునే తవ్వి మళ్లీ వేశారు

Satyam NEWS

ఆ సమయం లో అసలు బయటకు రావొద్దు

Bhavani

Leave a Comment