తాడేపల్లిలో సీపీఐ, సీపీఎం, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు రద్దుచేయాలని దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు చేస్తున్న తాడేపల్లి సీపీఐ, సీపీఎం నేతలు మద్ధతుపలికారు.
ఈ సందర్భంగా నేడు వామపక్ష పార్టీలు రాస్తారోకోకు పిలుపు నిచ్చాయి. ఇందులో భాగంగా తెల్లవారు జామున 3 గంటల నుండే సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, సీపీఎం నేతలు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బురగా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వేముల దుర్గారావును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని తాడేపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు . ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నేతలు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు అన్యాయమని అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఉపసంహరించుకునే వరకూ తమ పోరాటం రైతుపక్షాన కొనసాగుతుందని స్పష్టం చేశారు.