37.2 C
Hyderabad
May 2, 2024 13: 22 PM
Slider గుంటూరు

సీపీఐ, సీపీఎం నేత‌ల అరెస్టు

cpi arrests

తాడేపల్లిలో సీపీఐ, సీపీఎం, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల‌కు రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు రద్దుచేయాలని దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు చేస్తున్న తాడేప‌ల్లి సీపీఐ, సీపీఎం నేత‌లు మ‌ద్ధ‌తుప‌లికారు.


ఈ సంద‌ర్భంగా నేడు వామపక్ష పార్టీలు రాస్తారోకోకు పిలుపు నిచ్చాయి. ఇందులో భాగంగా తెల్లవారు జామున 3 గంటల నుండే సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, సీపీఎం నేతలు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బురగా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వేముల దుర్గారావును పోలీసులు ముంద‌స్తుగా అదుపులోకి తీసుకొని తాడేపల్లి పోలీసు స్టేషన్ కు త‌రలించారు . ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నేతలు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు అన్యాయమని అరెస్టుల‌తో ఉద్య‌మాన్ని ఆప‌లేర‌ని కేంద్ర ప్ర‌భుత్వం బిల్లుల‌ను ఉప‌సంహ‌రించుకునే వ‌ర‌కూ త‌మ పోరాటం రైతుప‌క్షాన కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Related posts

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

దటీజ్ తెలంగాణ: కన్నీళ్లు ఇక లేవు అన్నీ సాగు నీళ్లే

Satyam NEWS

మెడికవర్ వద్ద ఫ్లైఓవర్ కోసం కృషి: ఎంపీ ఆదాల వెల్లడి

Satyam NEWS

Leave a Comment