కరోనా వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి తమవంతు సహాయంగా ఐటిసి కంపెనీ డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకేట్స్ కంపెనీ డిస్ర్రీబ్యూటర్, కంపెనీ ప్రతినిధులు నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ కు అందించారు.
శనివారం ఐటిసి కంపెనీ డిస్ట్రిబ్యూటర్, అన్నపూర్ణ సేల్స్ కార్పొరేషన్ అధినేత గట్టాణి శ్రీనివాద్ ఎస్పీ కార్యాలయంలో 1800 బిస్కెట్ ప్యాకెట్లు అందించి జిల్లాలో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది అందరికి పంపిణీ చేయాలని కోరారు. కరోనా పై పోలీసులు చేస్తున్న పోరాటంలో ఐటిసి కంపెనీ వారికి బాసటగా నిలవాలని నిర్ణయించి బిస్కెట్ ప్యాకెట్స్ పోలీసులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
సుమారు 60 వేల రూపాయలు విలువ కలిగిన వీటిని పోలీసులకు అందించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉన్నదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సి.నర్మద, ఐటిసి కంపెనీ ప్రతినిధులు జ్యోతి రాజ్, యశ్ గట్టాణి, ధీరజ్ గట్టాణి, ఎస్.బి. డిఎస్పీ రమణారెడ్డి, సూపరింటెండెంట్ దయాకర్, సిఐలు అనిల్, సురేష్, ఆర్.ఐ. స్పర్జన్ రాజ్ తదితరులున్నారు.