తిరుమల మెట్ల మార్గంలో తరచూ చిరుత దాడుల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి దగ్గర భక్తులకు రక్షణగా కర్రలు ఇస్తోంది. నడక మార్గంలో చిరుతలను గుర్తించేందుకు 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. నడక మార్గంలో 30 మంది ఎక్స్ పర్ట్ బృందం పర్యటించనుంది.
ఈ బృందం చిరుత కదలికలను గుర్తించి బోనులు ఏర్పాటు చేయనుంది. శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించొద్దని నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల తర్వాత రెండో ఘాట్ రోడ్డులో బైక్లను నిషేధించారు.