మీర్ పేట్ లో సంచలనం సృష్టించిన సాయి వరప్రసాద్ హత్య కేసులో తప్పించుకొని తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను మీర్ పేట్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. సీఐ కె కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీరు బాటిల్స్ కోసం వెళ్లి వస్తున్న సాయి వరప్రసాద్ ను హత్య చేసిన వ్యక్తుల వివరాలు..
మీర్ పేట్ కు చెందిన ఎరుకల నితీష్ కుమార్ గౌడ్ ( 23) ఎ 1 గా పోచారం గ్రామం ఖమ్మం జిల్లాకు చెందిన ఇందుర్తి మహేందర్ రెడ్డి (20) ఎ2 గా, శ్రీ సాయి నగర్ జిల్లెల గూడ కు చెందిన కుంటాల సాయి కిరణ్ గౌడ్ (31) ఎ 3 గా, వివేక్ నగర్, జిల్లెల గూడ కు చెందిన నిమ్మగుడపు మనోహర్ గౌడ్ (34) ఎ 4 గా పెద్ద తుప్పరం గ్రామం శంషాబాద్ కు చెందిన కాటుకురి సురేష్, గౌడ్, కాటుకురి వెంకటేష్ గౌడ్ ఎ 4 ఎ 5 ముద్దాయిలు గా చేర్చారు.
బుధవారం అదుపులోకి తీసుకొని విచారించగా హత్య తామే చేశామని నేరాన్ని అంగీకరించారన్నారు. నిందితుల నుంచి 5 మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలు ఒక కారు, ఒక హోండా యాక్టివా , రెండు కత్తులు స్వాధీనం చేసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.