35.2 C
Hyderabad
May 1, 2024 00: 23 AM
Slider ముఖ్యంశాలు

నిర్బంధ అరెస్టులు కొత్తేమి కాదు

#MLA Etala Rajender

నిర్బంధించినంత మాత్రాన తమ పోరాటం ఆగదని, తమకు అరెస్టులు, నిర్బంధాలు కొత్త కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

ప్రతిసారీ అధికార పార్టీకి ఇది ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్షాలుగా తమపై ఉందన్నారు.కానీ కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు.

తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని, లేదంటే బీఆర్ఎస్‌ను ప్రజలు మార్చడం ఖాయమని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Related posts

హెంగార్డు నిజాయితీ…20వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ అప్పగింత…!

Satyam NEWS

గ్రామ పంచాయతీ కార్మికులకు పిఆర్సి అమలు చేయాలి

Satyam NEWS

గుడ్ న్యూస్: డాక్టర్లకు, వైద్య సిబ్బందికి శాలరీ కట్ లేదు

Satyam NEWS

Leave a Comment