గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నవతరం పార్టీ కన్వీనర్ గా బత్తుల అనిల్ ను నియమించారు. ఈ మేరకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, జాతీయ ప్రధాన కార్యదర్శి వి గణేష్ కుమార్ నియామక పత్రాన్ని అందచేశారు.
చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో నవతరం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతనంగా నియమితులయిన బత్తుల అనిల్ తెలిపారు.
బీసీ లకు పెద్దపీట వేస్తూ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తనపై నమ్మకంతో బాధ్యత ఇచ్చిన నవతరం పార్టీ అధిష్టానం కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బత్తుల చిన్న అంకమ్మరావు పాల్గొన్నారు.