31.2 C
Hyderabad
May 3, 2024 01: 20 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

బోరుబావిలో పడ్డ చిన్నారి సుజిత్ మృతి

sujith

తిరుచిరాపల్లి జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 72 గంటలపాటు చిన్నారిని కాపాడటానికి ప్రయత్నించిన  NDRF  బృందం సఫలం కాలేదు. బోరుబావి నుంచి మంగళవారం తెల్లవారుజామున సుజిత్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడు సుజిత్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సుజిత్ భౌతికకాయం పూర్తిగా కుళ్లిపోయిందని తెలిపారు. బాలుడి మృతదేహాన్ని మనప్పారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం సుజిత్ భౌతికకాయాన్ని మనప్పారై ఆస్పత్రి నుంచి నడుకాట్టుపట్టికి తరలించారు. సుజిత్ భౌతికకాయానికి పలువురు మంత్రులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్‌ను కాపాడేందుకు సహాయక చర్యలు మూడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 25న ఇంటి వద్ద ఆడుకుంటూ సుజిత్ బోరుబావిలో పడిపోయాడు.

Related posts

జూన్ 28 నుండి జూలై 6వ వరకు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

Bhavani

మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

Satyam NEWS

అవిశ్వాసంతో చైర్మన్ పదవి ఊస్ట్

Satyam NEWS

Leave a Comment