19.7 C
Hyderabad
January 14, 2025 05: 22 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

బోరుబావిలో పడ్డ చిన్నారి సుజిత్ మృతి

sujith

తిరుచిరాపల్లి జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 72 గంటలపాటు చిన్నారిని కాపాడటానికి ప్రయత్నించిన  NDRF  బృందం సఫలం కాలేదు. బోరుబావి నుంచి మంగళవారం తెల్లవారుజామున సుజిత్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడు సుజిత్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సుజిత్ భౌతికకాయం పూర్తిగా కుళ్లిపోయిందని తెలిపారు. బాలుడి మృతదేహాన్ని మనప్పారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం సుజిత్ భౌతికకాయాన్ని మనప్పారై ఆస్పత్రి నుంచి నడుకాట్టుపట్టికి తరలించారు. సుజిత్ భౌతికకాయానికి పలువురు మంత్రులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్‌ను కాపాడేందుకు సహాయక చర్యలు మూడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 25న ఇంటి వద్ద ఆడుకుంటూ సుజిత్ బోరుబావిలో పడిపోయాడు.

Related posts

మిషన్ భగీరథ కార్మికుల నిరసన

mamatha

విజయనగరం హోల్ సేల్ బట్టల మార్కెట్ అగ్ని ప్రమాదం

Satyam NEWS

చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు బ్రేక్

Satyam NEWS

Leave a Comment