మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడిగా సుధాకర్ తన ప్రత్యర్థి సంతోష్ కుమార్ పై 37 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా వి. రామకృష్ణా రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్.రాజేశ్వర్ రెడ్డి, పి.సంయుక్త, కోశాధికారిగా బి. పుష్యమి ఎన్నిక అయ్యారు.
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజిగిరి (TRESA) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి బుధవారం కీసర కలెక్టరేట్ లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా మన్నె ప్రభాకర్, ఎన్నికల పరిశీలకులుగా కె.నిరంజన్ రావు వ్యవహారించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ హాజరై రెవెన్యూ ఉద్యోగుల, రెవెన్యూ శాఖ సమస్యలపై ట్రెసా చేస్తున్న కృషిని వివరించారు. ట్రెసా రాష్ట్ర బాధ్యులు ఆర్గనైసింగ్ సెక్రటరీలు నాగమణి, సంజీవరావులు, జిల్లా పూర్వ అధ్యక్షులు ఎల్. వెంకటేశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని మొత్తం 69 మంది ఓట్లలో 47 మంది ఓటర్లు /ప్రతినిధులు పాల్గొని రహస్య ఓటింగ్ పద్దతిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించగా ప్రెసిడెంట్ గా పోటీ చేసిన దుండిగల్ డిప్యూటీ తహసీల్దార్ పి. సుధాకర్ కు 42 ఓట్లు పోలవగా, తన ప్రత్యర్థి ఎస్.సంతోష్ కుమార్ కు కేవలం 5 ఓట్లు పోలయ్యాయి. దీనితో సుధాకర్ గెలిచినట్టు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు. మిగతా పోస్టులన్నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త కార్యవర్గానికి రెవెన్యూ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.