మున్నేరు ముంపు బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి అందించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మం నగరం, నగరం చుట్టుపక్కల ముంపుకు గురై నష్టపోయిన వారి సహాయార్థం ఇట్టి మొత్తాన్ని అందించారని ఆయన అన్నారు.
కోటి రూపాయలు, కలెక్టర్ అధికార ఖాతాకు ఎంపీ బదిలీచేశారని ఆయన తెలిపారు. రూ. కోటి సహాయానికి ముంపు బాధితులు, జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు. గత వరదల సందర్భంలో ముంపు బాధితుల సహాయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ. కోటి ఆర్థిక సహాయాన్ని ఎంపీ చేసియున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.