33.2 C
Hyderabad
May 12, 2024 14: 18 PM
Slider ఖమ్మం

ముంపు బాధితుల కోసం కోటి ఇచ్చిన బండి

#Dr. Bandi Parthasarathy Reddy

మున్నేరు ముంపు బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి అందించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మం నగరం, నగరం చుట్టుపక్కల ముంపుకు గురై నష్టపోయిన వారి సహాయార్థం ఇట్టి మొత్తాన్ని అందించారని ఆయన అన్నారు.

కోటి రూపాయలు, కలెక్టర్ అధికార ఖాతాకు ఎంపీ బదిలీచేశారని ఆయన తెలిపారు. రూ. కోటి సహాయానికి ముంపు బాధితులు, జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు. గత వరదల సందర్భంలో ముంపు బాధితుల సహాయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ. కోటి ఆర్థిక సహాయాన్ని ఎంపీ చేసియున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

Related posts

దుర్గాష్టమి కారణంగా పోలీసు “స్పందన” రద్దు

Satyam NEWS

జన్మదిన కానుక

Satyam NEWS

విజయనగరం తిలక్ ప్రభాత్ శాఖలో గురుపూజోత్సవం

Satyam NEWS

Leave a Comment