మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూములు(సర్వే నెంబర్ 551/1,551/2 )లో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికుదుర్ అధికార పార్టీ జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డిపై మానుకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 24న స్థానిక తహశీల్దార్ ఇమ్మాన్యూయల్ ప్రభుత్వ భూమిని అక్రమించారని ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
దీంతో అధికార బీఆర్ ఎస్ జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డితో పాటు మరి కొంతమంది సుమారు 2-17 ఎకరాల భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు విచారణ చేపట్టి సెక్షన్ 447, 427, 34ఐపీసీ, 3పిడీపీపీఏ కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై తహశీల్దార్ను వివరణ కోరగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కేసులు పెడుతున్నామని, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.