ఆలయ ఇఓ కృష్ణవేణి ప్రభుత్వ యంత్రాగం ఒత్తిడికి తలా ఒగ్గింది వెరసి ఆలయ ఉద్యోగుల్లో ఇద్దరి పై సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పారిశుధ్య నిర్వహణ సరిగా లేనందున ఇద్దురు ఉద్యోగులను సస్పెండ్ చేయాలనీ కోరగా మొదట తిరస్కరించిన ఈ.ఓ కృష్ణ వేణి ఉన్నతాధికారుల ఒత్తిడికి తల ఒగ్గి ఇద్దరు ఉద్యోగులు సూపరెండెండెంట్ గౌరీ శంకర్,రికార్డు అసిస్టెంట్ గొట్టం రవిలను సస్పెండ్ చేశారు.
కాగా ఆవులు ఆవులు కొట్లాడితే లేగల కాళ్ళు విరిగినట్లు అధికారుల మధ్య విభేదాలు ఆ ఇద్దరి ఉద్యోగులను సస్పెన్షన్కు దారి తీశాయని ,అమాయకులైన ఇద్దరు ఉద్యోగులు ఇందుకు బలి కావాల్సి వచ్చిందని యుద్యోగులు వాపోతున్నారు.ఈ.ఓ కు మెమో జారీ చేయడం తో ఆమె వివరణ ఇస్తూనే ఇద్దరి ఉద్యోగుల పై వేటువేయడము సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.