వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి పూర్తిగా ఏడాది కూడా గడవక ముందే పార్టీ నాయకులు, మంత్రులు అవినీతి కి పాల్పడుతున్నారని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు కు చెందిన కార్యాలయాలు, ఆస్తులపై వైస్సార్సీపీ పార్టీ నాయకులు కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగానే దాడులు చేయిస్తుందని అన్నారు.
చంద్రబాబు నాయుడు వ్యక్తిగత మాజీ సహాయకుడు ఆయన శ్రీనివాసరావు కు చెందిన ఆస్తుల పై ఐ. టి దాడులు చేస్తే అతని ఇంట్లో కేవలం 18 లక్షల రూపాయల డబ్బు 11 తులాల బంగారం మాత్రమే దొరికిందని అన్నారు. అయితే అతని కుటుంబ సభ్యులకు, వారి తాలూకా బంధువులకు చెందిన ఇండ్ల లపై దాడులు చేసి 2000 కోట్ల రూపాయల దొరికినట్లు చెబుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని ప్రజలకి ఉపయోగ పడే రాజకీయాలు చేయాలని అన్నారు.