గార్ల పాకాల ఏటి పై హైలేవల్ వంతెన నిర్మాణం చేపట్టడం లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర ను విజయవంతం చేయాలని పార్టీ గార్ల మండల కార్యదర్శి జంపాల వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈమేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రతి వర్ష కాలంలో గార్ల మండలం పరిధిలోని రాం పురం, మద్ది వంచ గ్రామ పంచాయతీల ప్రజలతో పాటు కురవి, మహబూబాబాద్, డోర్నకల్ మండలాలకు చెందిన ప్రజలు పాకాల ఏటి నుండి రాకపోకలు సాగించలేక పోతున్నారన్నారు. పాకాల ఏటి పై హైలేవల్ వంతెన పాలకుల హామీ లకే పరిమితమైందన్నారు.
ఇందుకు నిరసన గా తలపెట్టిన పాదయాత్ర లో పార్టీ లకు అతీతంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాగం రమేష్, కృష్ణమూర్తి, లోకేష్, వీరన్న, నాగేష్, నాగరాజు, రంగయ్య, శివ, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.