కొల్లాపూర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి చురుకుగా సాగుతున్నది. పట్టణ కేంద్రంలోని 20వ వార్డు లో నేటి ఉదయం జిల్లా అడిషనల్ కలెక్టర్ మన చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ రఘు ప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి, వైస్ చైర్మన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొల్లాపూర్ లో విద్యుత్ స్తంభాలకు సంబంధించిన సమస్యలను తక్షణమే తీరుస్తున్నామని తెలిపారు. పాడైపోయిన స్తంభాలను తొలగిస్తామని, లూజుగా ఉన్న వైర్లను సరిచేసి విద్యుత్ సరఫరా సక్రమంగా జరిపేలా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.
తుప్పు పట్టిపోయిన కరెంటు స్తంభాలను సరి చేస్తామని కూడా ఆయతన తెలిపారు. పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. పట్టణంలో స్మశాన వాటికలను ఏర్పాటు చేయడమనేది కూడా పట్టణ ప్రగతిలోని ముఖ్యాంశమని ఆయన తెలిపారు.