బిచ్కుంద మండల తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, పదవ తరగతి విద్యార్థులకు 12 రోజులకి సరిపడా స్నాక్స్ మండల పరిషత్తు అధ్యక్షులు అశోక్ పటేల్ చేతుల మీదుగా మంగళవారం అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్ కిషోర్, నాయకులు నూకల రాజు, ఖత్గావ్ హన్మండ్లు, తపస్ జిల్లా కార్యదర్శి రచ్చ శివకాంత్, తపస్ బిచ్కుంద అధ్యక్షులు వై రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఖయ్యూమ్, తపస్ ఉపాధ్యక్షుడు యం సంజయ్, పాఠశాల ఉపాధ్యాయులు వేద్ భూషణ్, గంగాధర్, కొండల్ రెడ్డి, హన్మంత్ రావు, మరియు విధ్యార్థులు పాల్గొన్నారు.