42.2 C
Hyderabad
May 3, 2024 17: 14 PM
Slider హైదరాబాద్

భార్తను హత్య చేసిన భర్త

#killed

హైదరాబాద్ కంటోన్మెంట్ ఒకటవ వార్డు పరిధి నూతన్ కాలనీ లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గత రెండు సంవత్సరాలుగా అమలాపురం కు చెందిన కిరణ్, షీలా దంపతులు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్ చిల్కానగర్లలో నివసిస్తున్న సత్యనారాయణ తన భార్య ఝాన్సీ రాణి ని తీసుకొని రెండు రోజుల క్రితం బోయిన్ పల్లి లోని తన బావమరిది కిరణ్ ఇంటికి వచ్చాడు.

శనివారం ఉదయం 11 గంటలకు వారి మధ్య గొడవ పెరిగింది, మాట మాట పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో తన భార్య ఝాన్సీ పై దాడికి దిగి హతమార్చాడు. ఈ దాడిలో ఝాన్సీ రాణి అక్కడికక్కడే మృతిచెందగా బావమరిది కిరణ్ భార్యకు స్వల్ప గాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న బోయినిపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీఐ రవికుమార్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బేగంపేట్ ఏసీపీ పృథ్వి నాదరావు ని సందర్శించి పూర్వపరాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..

Related posts

శిథిలావస్థకు చేరుకుంటున్న మోడల్ కాలనీ ఇండ్లు

Satyam NEWS

నమ్మితే నట్టేటా ముంచారు.. రూ.55 లక్షల పైగా దోపిడీ

Sub Editor

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వస్తున్న మంద కృష్ణమాదిగ అరెస్టు

Satyam NEWS

Leave a Comment