29.7 C
Hyderabad
May 2, 2024 05: 07 AM
Slider మెదక్

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

#KCR

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చికెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్ రెండుసార్లు అధికారం చేపట్టినా అభివృద్ధి ఫలితం శూన్యం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించి రాజకీయ పబ్బంగడుపుకుంటుందని ఎద్దేవా చేశారు.సీఎం కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోని దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని తీవ్రంగా విమర్శించారు.

పంట నష్ట పరిహారం ఇస్తానని బస్సు ప్రయాణం చేసిన సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి 10000 ఇచ్చి రాష్ట్రమంతా ఎగబెట్టాడని, అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చుకెళ్ళారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

G20 దేశాలకు నాయకత్వం వహించేందుకు భారత్ రెడీ

Satyam NEWS

విధానాల రూపకల్పనతోపాటు అమలు కూడా ముఖ్యమే

Satyam NEWS

న్యూ ఇన్ వెన్షన్ : ఇక క్యాన్సర్‌కు కీమోథెరపీ అవసరం లేదు

Satyam NEWS

Leave a Comment