అప్పుడే పుట్టిన మగ శిశువును సంచిలో పెట్టి గిద్దలూరు తాసిల్దార్ కార్యాలయం ముందు వదిలేసి వెళ్లిందో గుర్తుతెలియని తల్లి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు అపుడే పుట్టిన మగ శిశువును ఒక సంచిలో పెట్టి
గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోగా ఆ సంచిని పందులు లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలో పసికందు ఏడుపు విని తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది పందులను తరిమి కొట్టారు. సంచిలో చూడగా శిశువు కనిపించడంతో
వెంటనే శిశువును ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు.