ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ తండ్రి ఎల్.జీ. రాం ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. జగిత్యాలలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రమణ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎల్.జీ రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ వెంట కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ వసంత, తదితరులు ఉన్నారు.