అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారూ, మీరు అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీల ఓట్లకోసం, నమ్మించి.. అధికారం చేజిక్కించుకొని, మా బలహీన వర్గాలకు చెందిన ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలను తీసివేసి, ఆఖరకు అంబేద్క ర్ పేరు మీద ఉన్న పథకాన్ని తీసి మీరేదో అంబేద్కర్ కన్నా గొప్పలా మీ పేరుపెట్టుకున్న ఘనత మీదికాదా అని అడుగుతున్నామని జనసేనపార్టీ నేత ఆదాడమోహనరావు ద్వజమెత్తారు.
ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి కి బాడంగి మండలం,వీర సాగగరం గ్రామస్థులకు దాదాపు ముప్పై ఎస్టీ కొండదొరకు చెందిన కుటుంబాలకు, మూడేళ్ళ గా పదిహేడు చెరువులను బ్రతడానికి చేపల పెంపకంనకు ఇవ్వగా.. గడువుతీరకముందే, ఆ చెరువులకు అక్కడున్న స్ధానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు, సర్పంచ్, ఎం.పి.పి., పంచాయితీ సెక్రటరీలు ఆ చెరువులకు మళ్ళీ వెలంపాటవేసి వీళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. వీరికి మళ్ళీ ఆ చెరువులను చేపల పెంపకానికి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. ఈ కొండదొరలకు న్యాయం జరిగేవరకు జనసేన తరుపున పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరసాగరం కు చెందిన బాధిత కుటుంబాలు హాజరయ్యారు.