స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం చంద్రబాబు కుట్రకు అద్దం పడుతున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి ఆర్దికం గా వేలాది కోట్ల నష్టం జరిగిందని ఆయన విమర్శించారు.
ఆనం రామనారాయణ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పేరుతో చంద్రబాబు స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డు పడటం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజాక్షేత్రం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము టి డి పి కి లేదు కనుకే ఇలా ఎన్నికలను అడ్డుకున్నారని ఆయన అన్నారు.
అలాగే బాబు కుట్రలకు వత్తాసు పలికిన ఎన్నికల కమిషన్ చర్యల పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. ఏ క్షణం ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.