కడప జిల్లా సిద్ధవటం తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఆకస్మికంగా ఏసీబీ అధికారుల ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు డి.ఎస్.పి కంజంక్షన్, సీఐ కృష్ణ మోహన్, ఎస్సై నరేష్ తదితర 22 మంది సిబ్బంది పాల్గొన్నారు.
కోట్ల రూపాయలు విలువ చేసే భూము లను ప్రభుత్వ స్థలాలను నేతలకు అప్పనంగా కట్ట బెట్టారని,రెవెన్యూ రికార్డుల తారుమారు చేశారని అమరావతి స్పందనకు ప్రజలు చేసిన అబియోగంపై ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
తనిఖీల సమయంలో తాశీల్ధార్ రామకుమారి కార్యాలయంలో ఉన్నారు.ఏసీబీ అధికారులు రికార్డులను ముమ్మరంగా తనిఖీ చేసి,పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.తనిఖీల అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.