పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్ కావడంతో ఏపిలో సంచలనం రేగింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి జిలా పరిషత్ హై స్కూల్ నుంచి ఈ పేపర్ లీక్ అయినట్లు చెబుతున్నారు. అక్కడి పరీక్ష సెంటర్ నుంచి వాటర్ బాయ్ ఒకరు తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లు చెబుతున్నారు.
రూమ్ నెంబర్ 3 లో వాటర్ బాయ్ ప్రశ్నాపత్రం ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. జిల్లా విద్యాశాఖ అధికారి దీనిపై విచారణ ప్రారంభించారు. రూమ్ నెంబర్ 3 ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేయడంతో పాటు వాటర్ బాయ్ తొలగించారు. ఎంఈఓ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.