33.7 C
Hyderabad
April 30, 2024 01: 56 AM
Slider ఆంధ్రప్రదేశ్

రెండు బస్సులు ఢీ: ఇద్దరి మృతి 36 మందికి గాయాలు

bus-accident.jpg

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. శబరిమల నుంచి నల్గొండకు అయ్యప్ప భక్తుల బృందంతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నెల్లూరు – పూతలపట్టు రహదారిపై కాశిపెంట్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన బస్సు డ్రైవర్‌ రమేష్‌, మరో ప్రయాణికుడు మృతి చెందగా.. మరో 30 ​​మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రులను తరలించడానికి అంబులెన్స్‌లు లేక లారీలో ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Related posts

ఢమాల్ అంటున్న చైనా రియల్ ఎస్టేట్ రంగం

Satyam NEWS

క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి…ఫైర్ సేప్టీ జాగ్ర‌త్తలు కూడా కంప్ల‌స‌రీ…!

Satyam NEWS

సింహాచలం ల్యాండ్ స్కాం లపై బిగుస్తున్న విజిలెన్స్ ఉచ్చు

Satyam NEWS

Leave a Comment