కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెలాఖరు వరకూ వ్యాపారులు స్వచ్చందంగా పూర్తి లాక్ డౌన్ పాటించాలని నిర్ణయించారు. అచ్చంపేట లోని అన్ని వ్యాపార సంఘాలు నేడు సమావేశం నిర్వహించాయి.
అచ్చంపేటలో కరోనా విజృంభణ అధికంగా ఉన్న నేపథ్యంలో అన్ని వ్యాపార సంఘాలు, అన్ని కుల సంఘాలు ఏకగ్రీవంగా ఈ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే శుక్రవారం వరకు సంపూర్ణ లాక్ డౌన్ చేయాలని వారు భావిస్తున్నారు. దీనికి వ్యాపారస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చి కచ్చితంగా సంపూర్ణ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.