40.2 C
Hyderabad
April 29, 2024 15: 11 PM
Slider నల్గొండ

12 టన్నుల చేపలు మృతి తో రూ.25లక్షల నష్టం

#Fishermen

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు మందు పెట్టడంతో 12 టన్నుల చేపలు చనిపోయాయి. కొందరు కావాలనే ఉద్దేశ్యపూర్వకంగానే చేపలకు మందు పెట్టి చంపారని మత్స్యకారుల సంఘానికి చెందిన ఇండ్ల సురేష్,మాజీ అధ్యక్షులు గుంటి సైదులు తెలిపారు.

ఎలా చనిపోయాయనే నిర్ధారణకు కొన్ని చేపలను టెస్టింగ్ కు పంపించామన్నారు. జిల్లా అధికారులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతి చెందిన చేపలను, పరిసరాలను పరిశీలించారని అన్నారు. సుమారు 12 టన్నుల చేపలు చనిపోవటంతో 25లక్షల రూపాయలు నష్టం జరిగిందని సూర్యాపేట మత్స్యకారుల సంఘ సభ్యులు పేర్కొన్నారు.

Related posts

అసలే అధికార పార్టీ… అందులోనూ రౌడీ షీటర్…

Satyam NEWS

బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే పిల్లి కూత కూసినట్టు ఉంది

Satyam NEWS

టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలతో ఆడిట్ కి సిద్ధమా?

Satyam NEWS

Leave a Comment