సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు మందు పెట్టడంతో 12 టన్నుల చేపలు చనిపోయాయి. కొందరు కావాలనే ఉద్దేశ్యపూర్వకంగానే చేపలకు మందు పెట్టి చంపారని మత్స్యకారుల సంఘానికి చెందిన ఇండ్ల సురేష్,మాజీ అధ్యక్షులు గుంటి సైదులు తెలిపారు.
ఎలా చనిపోయాయనే నిర్ధారణకు కొన్ని చేపలను టెస్టింగ్ కు పంపించామన్నారు. జిల్లా అధికారులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతి చెందిన చేపలను, పరిసరాలను పరిశీలించారని అన్నారు. సుమారు 12 టన్నుల చేపలు చనిపోవటంతో 25లక్షల రూపాయలు నష్టం జరిగిందని సూర్యాపేట మత్స్యకారుల సంఘ సభ్యులు పేర్కొన్నారు.