తెలుగువారి తొలి ప్రధాని
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామ వాసి
ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు
భూసంస్కరణలకు బాధ్యుడు మన పి.వి.
తెలుగుజనుల అచ్చ తెలుగు ఠీవి మన పి.వి
సంప్రదాయ కుటుంబంలో జన్మించి
ఉన్నత చదువులను అభ్యసించి
శాసనసభ్యునిగా రాజకీయ అరంగేట్రం గావించి
మంత్రిగా, ముఖ్యమంత్రిగా
కడకు దేశప్రధానిగా ఎన్నికై
తెలుగువారి ఠీవిని
ప్రపంచానికి తెలియపరచిన
రాజకీయ సవ్యసాచి మన పి.వి.
తెలుగువారి కట్టు బొట్టును ధరిస్తూ
వైవిధ్యభరితమైన సాహితీ రచనలను గావిస్తూ
దేశంలో సరళీకృత ఆర్ధిక విధి విధానాలను
ప్రవేశపెట్టిన సంస్కరణల సూరీడు మన పి.వి.
జగతికే ఆదర్శం
ఆయన ప్రదర్శించిన ప్రజ్ఞాపాఠవం
ఆళ్ల నాగేశ్వరరావు, తెనాలి, చరవాణి 7416638823