అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ డిమాండ్ చేశారు . ఖమ్మం నగరంలోని స్థానిక మంచికంటి భవన్లో జరిగిన ఖమ్మం నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు వేలకు వేలు ఫీజులు గడిస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఏదైతే విద్యాసంస్థలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారో ఆ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర్ కార్యదర్శి తరుణ్ నాయకులు అన్వేష్, నాగరాజు, కోటేశ్వరరావు, వెంకటకృష్ణ, శభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
previous post