ఆసియాలోని అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ మరో అతి పెద్ద డీల్ చేశారు. హోల్సిమ్ లిమిటెడ్ వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్ 10.5 బిలియన్ డాలర్లకు ( 60 కోట్ల 82 లక్షల 50 వేలు) జరిగింది. ఈ డీల్తో పోర్ట్ ల నుంచి ఎనర్జీ రంగంలో పనిచేస్తున్న అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.
గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూప్ దాని ప్రధాన వ్యాపారమైన పోర్ట్ కార్యకలాపాలు, పవర్ ప్లాంట్లు మరియు బొగ్గు గనుల నుండి విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీకి విస్తరించింది. గ్రూప్ గత ఏడాది రెండు సిమెంట్ అనుబంధ సంస్థలను ప్రారంభించింది.
ఈ రెండు అనుబంధ సంస్థలు అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ మరియు అదానీ సిమెంట్ లిమిటెడ్. ఇందులో గుజరాత్లోని దహేజ్, మహారాష్ట్రలోని రాయ్గడ్లో అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ రెండు సిమెంట్ యూనిట్లను నిర్మించాలని యోచిస్తోంది. ఈ ఒప్పందం గౌతమ్ అదానీ గ్రూప్ని దేశీయ సిమెంట్ రంగంలో రెండవ అతిపెద్ద వ్యాపార సంస్థగా చేస్తుంది.