వివేకా హత్య కేసుకు సంబంధించి.. అనుబంధ ఛార్జిషీట్ను సీబీఐ.. కోర్టులో దాఖలు చేసింది. ఆ అనుబంధ ఛార్జిషీట్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డిలపై సీబీఐ దాఖలు చేసింది. ఇదిలా వుండగా వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు సీబీఐ కోర్టు మరోసారి రిమాండ్ను పొడిగించింది. నేటితో సీబీఐకి దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఇచ్చిన గడువు ముగియడంతో.. నిందితులను సీబీఐ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారించిన సీబీఐ కోర్టు ధర్మాసనం.. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్ను జులై 14 వరకు పొడిగిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆరుగురు నిందితులను సీబీఐ కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు.
previous post