రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్. అంజయ్య కరోనాతో ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ఒక మంచి అధికారిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కలెక్టర్ అన్నారు. అదే విధంగా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కూడా సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కు చెందిన ఆర్. అంజయ్య నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేశారు.
పదోన్నతిపై రాజన్న సిరిసిల్ల కు అదనపు కలెక్టర్ గా వచ్చారు. కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని, అయితే ఆయనను కరోనా వ్యాధి కబళించిందని ఆయన లేరనే వార్త నమ్మలేకపొతున్నామని కలెక్టర్ అన్నారు.
అన్ని శాఖలతో సత్సంబంధాలు నెలకొల్పి అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.