విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి హెచ్ పి సి ఎల్ లో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. భయంకరమైన శబ్దాలతో భయానక వాతావరణం నెలకొనడంతో స్థానికులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
ఉద్యోగులను అందరిని అత్యవసర సైరెన్ మ్రోగించి అధికారులు బయటకు పంపారు. కొత్త చిమ్ని లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. రిఫైనరీ నుండి మంటలు ఎగసిపడుతున్నాయి. హెచ్ పీసీఎల్ లో అగ్నిప్రమాదం వల్ల నల్లని మబ్బులు లాగా పొగలు వ్యాపించాయి.
పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో సంస్థలోని ఫైరింజన్లు కూడా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రమాద సూచికలు తెలియజేస్తూ సంస్థ సైరన్ లు మోగించడం జరిగింది.
మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. అత్యంత నూతన టెక్నాలజీ తో నిపుణులైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు HPCL అధికారులు ప్రయత్నిస్తున్నారు.