రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బూర రమేష్ ఇటీవల కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నేడు బూర రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు.
అదే విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉద్యోగి బొందిల శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీనివాస్ కూడా ఇటీవల మరణించడంతో వారి కుటుంబాలను కూడా శనివారం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాము గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కనికరపు రాకెష్, మల్లేశం తదితరులు ఉన్నారు.