అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబులిటీ అండ్ ఎవెర్నెస్ (అస్రా) ఆధ్వర్యంలో ఈ నెల 24న న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగనున్న జాతీయ స్థాయి వినియోగదారుల హక్కుల అవగాహనా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను, బ్రోచర్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. వినియోగదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, సమాజంలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆస్రా మరింత కృషి చేసిందని ఆయన పిలుపునిచ్చారు. ఆస్రా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సంస్థ జిల్లా అధ్యక్షుడు గంజి ఎజ్రా, ఉపాధ్యక్షులు జి. ఇందిరాప్రసాద్, గౌరవ సలహాదారులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అన్నెపు సత్యనారాయణ, కద్దాల శ్యామసుందర్, కె.పి.శారది, లఖినేని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
previous post