28.7 C
Hyderabad
April 28, 2024 06: 05 AM
Slider జాతీయం

శ్రద్ధాను శారీరకంగా హింసించిన ఆఫ్తాబ్

#shradhavakar

దేశాన్ని కుదిపేసిన శ్రద్ధా హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మృతుడి వాట్సాప్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో వచ్చిన మూడు ముఖ్యమైన మేసేజిలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. శ్రద్ధ బాయ్ ఫ్రండ్, ఈ కేసులో దోషి అయిన ఆఫ్తాబ్ శ్రద్ధను తీవ్రంగా వేధిస్తుండేవాడని ఈ మెసేజీల సారాంశం. ఆమెను శారీరకంగా ఆఫ్తాబ్ తీవ్రంగా హింసించినట్లు ఈ మెసేజీల ఆధారంగా వెల్లడి అవుతున్నది. 2020 సంవత్సరంలో శ్రద్ధా తాను పని చేసే కాల్ సెంటర్ మేనేజర్‌తో ఈ సమాచారాన్ని పంచుకున్నారు.

‘అఫ్తాబ్‌ వెళ్లిపోవాలని నేను కోరుకుంటున్నాను’, ‘అఫ్తాబ్ కొట్టిన దెబ్బలకు నా శరీరం నొప్పి పుడుతోంది’ ‘నాకు ఇప్పుడు శక్తి లేదు’ అని మేనేజర్‌తో చెప్పింది శ్రద్ధ. ఈ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధ మృతదేహాన్ని 18 నుండి 20 ముక్కలుగా నరికి చంపినట్లు కూడా వాట్సయాప్ లో వెల్లడైంది. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికినట్లు సమాచారం. తొలుత అఫ్తాబ్ పోలీసులను మోసం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని, అయితే కఠినంగా ప్రశ్నించడంతో కొన్ని విషయాలు తెలిపాడని పోలీసులు అంటున్నారు.

శ్రద్ద హత్యకు సంబంధించిన రహస్యాలన్నింటినీ పోలీసుల ముందు చాటేశాడు. అదే సమయంలో, అఫ్తాబ్ తండ్రి అతని జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించాడు. అఫ్తాబ్ చాలా షార్ప్ మైండ్ అని చెప్పుకుంటున్నారు. మొదట్లో పోలీసులను తన వలలో పడేసేందుకు ప్రయత్నించాడు. హత్య అనంతరం అఫ్తాబ్ శరీర భాగాలను పారవేసి ముంబై వెళ్లాడు. ముంబై, ఉత్తరాఖండ్, హిమాచల్ ఇతర రాష్ట్రాల్లో శ్రద్ధా హత్య కేసులో దర్యాప్తుకు సంబంధించిన సాక్ష్యాలను కనుగొనడానికి అఫ్తాబ్ కు సంబంధించిన విషయాలు పరిశోధించడానికి ఢిల్లీ పోలీసుల అనేక బృందాలుగా విడిపోయి పని చేస్తున్నారు.

Related posts

27న విద్యార్ధులతో ప్రధాని మోడీ చర్చ

Satyam NEWS

దిగులు మేఘం

Satyam NEWS

ఔత్సాహిక టెక్కీలకు టీటా స‌భ్య‌త్వ‌ ఆహ్వానం

Sub Editor

Leave a Comment