బాలివుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఆమె కుమార్తె ఆరాధ్య లను నేడు నానావతి ఆసుపత్రిలో ఎడ్మిట్ చేశారు. ఐశ్వర్యారాయ్, ఆరాధ్య లకు కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే నేడు వారిని నానావతి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.
ఇప్పటికే నానావతి ఆసుపత్రిలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు నలుగురికి కరోనా చికిత్స జరుగుతున్నది. అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కు కరోనా నెగెటీవ్ వచ్చింది.