శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఇటీవల ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అనంతరం స్వల్పంగా అస్వస్థులు కావటం తో నంద్యాల లోని స్వగృహం లో విశ్రాంతి తీసుకున్నారు.
సందేహ నివృత్తి కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా పరీక్షలు జరిపించుకున్నారు. RT -PRC పరీక్షలు ఫలితం వచ్చేసరికి 3 రోజులు పట్టింది. అంతవరకూ ఆయన హైదరాబాద్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. పరీక్ష ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక ఆసుపత్రి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.