విద్యా రంగంలో అగ్రగామి సంస్థగా నీట్, జేఈఈ ఫలితాల్లో ప్రతియేటా ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఆకాష్ బైజుస్ సంస్థ ఇప్పుడు కాకినాడలో తమ తొలి బ్రాంచ్ ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలలో విస్తరించి ఉన్న ఆకాష్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 75 బ్రాంచ్ గా ప్రారంభించినట్టు రీజినల్ సేల్స్ గ్రోత్ హెడ్ మందాడి భరత్ కుమార్ ప్రారంభించారు.
ఆపరేషన్ హెడ్ అరబింద్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో దాదాపు 305 శాఖలు కలిగి ఉందని, ప్రస్తుతం కాకినాడలో 9 తరగతి గదులతో కూడిన నూతన ప్రాంగణంలో సుమారు 808 మంది విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాకినాడ భాస్కర్ నగర్ లోని లక్ష్మీ టవర్స్ లో ఈ నూతన శాఖను రీజినల్ సేల్స్ గ్రోత్ హెడ్ మందాడి భరత్ కుమార్ ప్రారంభించారు.
అనేక మంది వైద్యులను ఐఐటి లుగా తయారు చేసేందుకు పాన్ ఇండియా నెట్వర్క్ నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా విధానం ద్వారా నూతన సాంకేతికతతో శిక్షణా తరగతులు కొనసాగిస్తామని తెలిపారు. ఆకాష్ బైజూస్ లో అడ్మిషన్ పొందాలనుకునేవారు తాము నిర్వహించే ఇన్స్టెంట్ అడ్మిషన్ కం స్కాలర్షిప్ ప్రోగ్రాం లేదా ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందవచ్చునన్నారు. 34 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన తమ సంస్థ ద్వారా లక్షలాదిమంది వైద్యులు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దద్దారని మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి తెలిపారు.
అలాగే నిరుపేద బాలిక విద్యార్థులకు చేయూత నిచ్చే దిశలో తల్లిదండ్రులు లేని,నిరుపేద బాలిక విద్యార్థులకు ఆజాద్ క అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 2000 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ఈ ఏడాది నుండి ఆకాష్ సంస్థ ప్రతిపాదించిందని ఆకాశ్ బైజూస్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు ..ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏరియా బిజినెస్ హెడ్ రవికిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్ వై లక్ష్మీనారాయణ, కార్పొరేట్ మేనేజర్ వివేక్ శుక్ల తదితరులు పాల్గొన్నారు.