భూ వివాదాలతో అట్టుడుకుతున్న తిరుపతి నగరంలో పోలీసు వ్యవస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
వివాదాలకు కేంద్ర బిందువు అయిన అలిపిరి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న సిఐ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు వేశారు. నగరంలో భూదందాలకు సహకరిస్తున్నాడని తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా సిఐ సుబ్బారెడ్డి ని క్రైమ్ రికార్డ్స్ విభాగానికి ని బదిలీ చేశారు.
తాడిపత్రి రూరల్ సిఐ గా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్ ను అలిపిరి పిఎస్ సిఐగా నియమించారు.